లిక్కర్ ఫ్యాక్టరీకి రేషన్ బియ్యం

031313.201

పేదలకు తక్కువ ధరకే ఇస్తున్న రైస్.. ఇప్పుడు లిక్కర్ ఫ్యాక్టరీల వశమవుతోంది. రీసెంట్ గా.. 340 క్వింటాల్ బియ్యాన్ని రెండు ట్రక్కుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో న‌మ్మ‌లేని నిజాలు వెలుగుచూశాయి. ఈ స్కామ్‌లో రేషన్ డీలర్స్, సివిల్ సప్లయ్ ఉద్యోగులున్నట్లు తేలింది.దీంతో పీడీఎస్ రైస్ గురించి తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ, ఆంధ్ర మాత్రమే కాక మహారాష్ట్ర‌లోనూ రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రతినెలా గోడౌన్ నుంచి మండల స్థాయి రేషన్ డిపోలకు వందల టన్నుల్లో బియ్యం వెళ్తోంది. వీటిని వినియోగించని రేషన్ కార్డు హోలర్డ్స్ నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారట! ఇలా రకరకాలుగా సేకరించిన బియ్యాన్ని కరీంనగర్‌లోవున్న ఓ ప్రైవేటు సీడ్స్‌ కంపెనీకి తరలిస్తున్నారు.మంచి క్వాలిటీ ఉన్న రైస్‌ని స్మగ్లర్లు లిక్కర్ ఫ్యాక్టరీకి తరలించి లిక్కర్‌ తయారీలో వినియోగిస్తున్నారు.పౌరసరఫరాల వ్యవస్థపై స‌రైన నియంత్ర‌ణ లేకపోవడమే ఈ త‌ర‌హా స్కామ్‌లు చోటుచేసుకుంటున్నా య్‌. అందుక‌నే స్మ‌గ్ల‌ర్ల ఆట‌లు య‌థేచ్ఛ‌గా సాగుతున్నాయ్‌.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...