కొత్త గ్రూపును స్టార్ట్ చేసిన నాగార్జున

408014505443

ఇంత కాలం నాగార్జున అన్ని గ్రూపులతో కలిసిమెలిసిగా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం నాగార్జున ఇండస్ట్రీలో కొత్త గ్రూపుని మెయింటెన్ చేయబోతున్నాడని అంటున్నారు. ఎందుకంటే నాగార్జున నటిస్తున్న వరుస చిత్రాలకి కారణం సక్సెస్ ఫుల్ టీం అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ టీంనే తను మెయింటెన్ చేయాలని చూస్తున్నాడు. తరువాతి కాలంలో ఇదొక గ్రూపుగా ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తన కెరీర్లోనే హైయస్ట్ కలెక్షన్స్ వచ్చిన మూవీగా నిలిచింది. ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కి మంచి పేరు వచ్చింది. అలాగే కథా రచయిత పి.రామ్ మోహన్ కి సైతం మంచి పేరు వచ్చింది. ఇక నాగార్జున వీరిద్దరితో వరుస చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు. కేవలం తన చిత్రాలనే కాకుండా, తనయుల చిత్రాలకి సంబంధించిన కథలను పి.రామ్ మోహన్ కి బాధ్యతలను అప్పజెప్పాలని చూస్తున్నాడు. రామ్ మోహన్ అష్టా చమ్మా సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. గోల్కొండ హై స్కూల్, ఉయ్యాలా జంపాలా సినిమాలు ఇతని నుండి వచ్చినవే. సోగ్గాడే సినిమాకి కథ రచయితగా ఉండటంతో, సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో రామ్ మోహన్ కి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఉన్న దర్శకుడిని నాగార్జున తన టీంలో తీసుకున్నాడు. అలాగే కళ్యాణ్ తోనూ వరుస సినిమాలు ప్లాన్ చేశారు. వీరే కాకుండా మరో ఇద్దరు రచయితలు, నలుగురు యువదర్శకులని నాగార్జున తీసుకొని ఓ గ్రూపుగా వరుస ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడంట. ఎప్పుడూ గ్రూపులకి దూరంగా ఉండే నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అందరూ షాక్ అవుతున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...