ఉద్యోగం ఇప్పిస్తామని.. గ్యాంగ్ రేప్ చేశారు




మీరట్: ఇద్దరు దుండగులు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి ఢిల్లీకి చెందిన ఓ యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన బాధితురాలు (21) గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమెకు మూణ్నెళ్ల క్రితం పరిచయమైన ప్రతాప్ అనే యువకుడు ఉద్యోగ ఇప్పిస్తామని చెప్పాడు. ఇద్దరూ కలసి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఫరిదాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఇటీవల ప్రతాప్.. సుబోధ్ అనే యువకుడిని ఆ యువతికి పరిచయం చేశాడు. అతను కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. పది రోజుల క్రితం ఇద్దరూ ఆమెను మీరట్ కు తీసుకెళ్లారు. ఆమెకు డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి ఇద్దరూ లైంగిక దాడి చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...