మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్

tt

టాలీవుడ్‌లో టాప్ క్రేజ్ ఉన్న ఫ్యామిలీలు అయిన మెగా – నంద‌మూరి హీరోల కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్లాన్ జ‌రుగుతుంది. మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్, నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా చేయ‌డానికి డైరెక్ట‌ర్ ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి క‌థ రెడీ చేశాడ‌నన్న వార్త ఇప్పుడు ఫిల్మ్‌న‌గ‌ర్లో హాట్ హాట్ న్యూస్‌. ఎప్పుడో ప‌ది సంవ‌త్స‌రాల క్రితం గోపీచంద్‌తో య‌జ్ఞం, బాల‌య్య‌తో వీర‌భ‌ద్ర లాంటి సినిమాలు తెర‌కెక్కించిన ఏఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి చాలా గ్యాప్ తీసుకుని మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో గోపీచంద్‌తో తీసిన ‘సౌఖ్యం’ ఫ్లాఫ్ తో డీలా పడ్డాడు.
సౌఖ్యం త‌ర్వాత ర‌వికుమార్ చౌద‌రి ఓ మంచి స్టోరీ రెడీ చేసుకుని ఈ క‌థ నిర్మాత కె.ఎస్.రామారావుకి వినిపించారు. ఆయ‌న ఓకె అన్నారు. ఈ స్టోరీకి సాయి కూడా ఓకే చెప్పాడ‌ట‌. సాయిధరమ్ తేజ్ కెరీర్ కు మెమరబుల్ హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరికి కళ్యాణ్ రామ్ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ ఇద్దరు హీరోలు సినిమాకు అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. అనుకున్నట్టగా ఈ సినిమా పట్టాలెక్కితే, యంగ్ జనరేషన్ లో ఇదే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...