టాలీవుడ్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు ఆకాశాన్నంటుతోంది. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూడు సినిమాలు రూ.50 కోట్ల షేర్ రాబట్టడంతో బన్నీ టాలీవుడ్ హిస్టరీలోనే ఈ ఫీట్ను సాధించిన తొలి హీరోగా నిలిచాడు. ఇక బన్నీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు బన్నిని పేస్ బుక్ లో కోటి మంది ఫాలో అవుతున్నారు. సౌత్ ఇండియాలో ఏ హీరోకి ఇంత ఫాలోయింగ్ లేదు అని చెప్పొచ్చు. రేసుగుర్రం సినిమాతో బన్ని మాస్ ప్రేక్షులకు విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే, బన్నికి అటు కేరళలోను విపరీతమైన క్రేజ్ ఉన్నది. అక్కడ బన్ని సినిమాలు మలయాళంలో డబ్ అవుతున్నాయి. కేరళలో బన్నికి మార్కెట్ ఉండటంతో అక్కడి యూత్ సైతం అల్లు అర్జున్ను ఫాలో అవుతోంది.
సౌత్ ఇండియాలోనే బన్నీకి ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బన్నీ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సరైనోడు సినిమా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ తన సహజశైలీకి తొలిసారి భిన్నంగా ఫుల్ మాస్ రోల్లో ఈ సినిమాలో నటిస్తున్నాడు.
No comments:
Post a Comment